టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా మరో మ్యాచ్ ఆడుతుంది. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించడంతో...టీమిండియా సెమీస్ చేరింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. అయితే కీలకమైన సెమీస్ ముందు పసికూనగా భావించే జింబాబ్వేపై విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈటోర్నీలో పాక్తో జింబాబ్వే షాకివ్వడంతో...ఆ జట్టును తక్కువ అంచనా వేయొద్దని రోహిత్ సేన అనుకుంటోంది. మరోవైపు ఈ టోర్నీలో అంచనాలకు మంచి రాణించిన జింబాబ్వే..చివరి మ్యాచ్లో విజయం సాధించి..విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాలని చూస్తోంది. భారత్పై గెలిచి..కనీసం విజయగర్వంతో స్వదేశానికివెళ్లాలని అనుకుంటోంది.
తుది జట్లు
ఇండియా: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, పంత్ , అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్ సింగ్.
జింబాబ్వే: ఎర్విన్ (కెప్టెన్), వెస్లీ మదెవరె, టోనీ మున్యోంగా, చకబ్వా, సీన్ విలియమ్స్, రజా, ర్యాన్ బర్ల్, విల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవా, టెండి చటారా, బ్లెస్సింగ్ ముజరబాని.