మూడు రోజుల పర్యటన కోసం భారత్ కు చేరుకున్న జాంబియా ప్రెసిడెంట్ … చాగ్వా లుంగుకు రాష్ట్రపతి భవన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశం తర్వాత రాజ్ ఘాట్ సందర్శించి మహత్మ గాంధీకి నివాళులర్పించారు.
ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో జాంబియా అధ్యక్షుడు చాగ్వాలుంగు, ఆ దేశ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఇండియా – జాంబియా మధ్య 6 ఒప్పందాలు జరిగాయి. మోడీ, లుంగ్ సమక్షంలో అధికారులు ఎంఓయూలు మార్చుకున్నారు. న్యూ ఢిల్లీలో ఇండియా- జాంబియా బిజినెస్ ఫోరం సందస్సులో… లుంగ్ పాల్గొంటారు.