జమ్ము కశ్మీర్లోని కిశ్త్వార్ జిల్లాలో ప్రమాదం జరిగింది. భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో చాపర్ లో ముగ్గురు పైలట్లు ఉన్నారు. వీరికి తీవ్రగాయలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ మర్వా ప్రాంతంలో కుప్ప కూలినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. హెలికాఫ్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రబల్, పోలీసులు హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అంతకు ముందు మార్చి నెలలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందిన ALH Dhruv Mark 3 హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో కుప్ప కూలింది. చాపర్ను టెస్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది జరిగిన సమయంలో చాపర్లో ముగ్గురు ఉన్నారు.