
గత నెల ఇండియా పాక్ మధ్య సైనిక పరమైన ఉద్రిక్తతల నాటి నుంచి డిఫెన్స్ స్టాక్స్ భారీ ర్యాలీని చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిఫెన్స్ స్టాక్స్ కొన్న ఇన్వెస్టర్లతో పాటు డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కింద పెట్టుబడులు పెట్టిన చాలా మందికి ఊహించని స్థాయిలో రాబడులను చూసిన సంగతి తెలిసిందే.
అయితే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మెుదలై 5 రోజులు గడుస్తున్న నేపథ్యంలో భారత డిఫెన్స్ స్టాక్స్ దాదాపు 5 శాతం వరకు పెరగటం గమనార్హం. చాలా మందికి అర్థంకాని విషయం ఏమిటంటే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇండియాలో స్టాక్స్ పెరగటం ఏంటనేదే. అయితే ఈ యుద్ధ పరిస్థితుల కారణంగా భారత రక్షణ రంగంలోని కంపెనీలకు ఇజ్రాయెల్ నుంచి భారీగా ఆర్డర్లు వస్తాయనే ఊహాగానాలు ఇన్వెస్టర్లను ముందుకు నడిపిస్తున్నాయి.
వాస్తవానికి భారతదేశం పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన మిస్సైల్ స్ట్రైక్స్ తర్వాత అనేక భారతీయ డిఫెన్స్ కంపెనీలకు దేశీయ అవసరాల కోసమే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చిన సంగతి తెలిసిందే. మరోపక్క రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజురోజుకూ భీకరంగా మారుతున్న యుద్ధ వాతావరణం కూడా డిఫెన్స్ రంగంలోని అనేక కంపెనీల షేర్లు పెరిగేందుకు దోహదపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ తన జీడీపీలో 1.9 శాతం వరకు డిఫెన్స్ అవసరాల కోసం కేటాయించటం కూడా ఇన్వెస్టర్లను మరింతగా ఆకర్షిస్తోంది. అలాగే 2025-26 నాటికి భారత రక్షణ పరికరాల ఎగుమతులు రూ.25వేల కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవటం కూడా కీలకంగా మారింది.
►ALSO READ | 5 రోజుల్లో 50% పెరిగిన స్మాల్ క్యాప్ స్టాక్.. ఇన్వెస్టర్లు ఎగబడటానికి అదే కారణం..
అయితే నిపుణులు మాత్రం ఎగుమతి ఆధారిత డిఫెన్స్ స్టాక్స్ జాగ్రత్తగా ఎంచుకోవటం మంచిదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో లాభపడిన డిఫెన్స్ స్టాక్స్ లిస్ట్ గమనిస్తే..
* మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్
* డేటా ప్యాటర్న్స్
* గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్
* భారత్ డైనమిక్స్
* కొచ్చిన షిప్ యార్డ్
* పరాస్ డిఫెన్స్
* భారత్ ఎలక్ట్రానిక్స్
* హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
* సోలార్ ఇండస్ట్రీస్
* సైయంట్ డీఎల్ఎమ్
* డిసిఎక్స్ ఇండియా
* ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్స్
* భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్