ఎకానమీ దూసుకెళ్తోంది

ఎకానమీ దూసుకెళ్తోంది
  • ఈ ఏడాది గ్రోత్​ 9.2 శాతం ఉంటుంది
  • నేషనల్​ స్టాటిస్టికల్​ ఆఫీస్​ (ఎన్​ఎస్​ఓ) వెల్లడి

న్యూఢిల్లీ: మన ఎకానమీ దూసుకెళ్తోంది. కొవిడ్​ ముందుకంటే గ్రోత్​లో వేగం పెరిగింది. వ్యవసాయం, మైనింగ్​, మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్ల పెర్​ఫార్మెన్స్​ మెరుగుపడటంతో ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ (2021–22)లో గ్రాస్ డొమెస్టిక్​ ప్రొడక్ట్​ (జీడీపీ) గ్రోత్​ 9.2 శాతానికి చేరుతుందని ప్రభుత్వం విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. కొవిడ్​ వైరస్​ వల్ల దేశమంతటా లాక్​డౌన్​ను అమలు చేయడంతో 2020–21లో ఎకానమీ 7.3 శాతం కుదించుకుపోయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ప్రతి క్వార్టర్లోనూ ఎకానమీ క్రమంగా వేగం పుంజుకుంటోందని నేషనల్​ స్టాటిస్టికల్​ ఆఫీస్​ తెలిపింది.  అన్ని రంగాలలోనూ గ్రోత్​ కనిపిస్తున్నట్లు శుక్రవారం ఎన్​ఎస్​ఓ రిలీజ్​ చేసిన డేటా వెల్లడిస్తోంది. 2021–22లో జీడీపీ రూ. 147.54 లక్షల కోట్లకు చేరుతుందని ఎన్​ఎస్​ఓ అంచనా వేస్తోంది. ఈ జీడీపీ 2020–21లో రూ. 135.13 లక్షల కోట్లు మాత్రమే. దీంతో ప్రి కొవిడ్​ లెవెల్ ​అంటే 2019–20 నాటి రూ. 145.69 లక్షల కోట్ల కంటే మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. 

కరోనా వల్ల మార్చి 2020లో దేశమంతటా లాక్​డౌన్​ ప్రకటించారు. దీంతో 2020–21 గ్రోత్​ రేట్​ బాగా పడిపోయింది.  ఆర్​బీఐ ఈ ఫైనాన్షియల్​ ఇయర్​కు ప్రకటించిన గ్రోత్​ అంచనాల కంటే ఎన్​ఎస్​ఓ అంచనాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. 2021–22లో గ్రోత్​ రేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్​బీఐ ప్రకటించింది. ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్లో మాన్యుఫాక్చరింగ్​ గ్రోత్​ 12.5 శాతానికి పెరుగుతుందని ఎన్​ఎస్​ఓ అంచనా వేస్తోంది.  మైనింగ్​ రంగంలోనూ ఈ ఏడాది మంచి గ్రోత్​ 14.3 శాతం, ట్రేడ్, హోటళ్లు, ట్రాన్స్​పోర్టు, బ్రాడ్​కాస్టింగ్​ సంబంధ కమ్యూనికేషన్​ అండ్​ సర్వీసెస్ కూడా 11.9 శాతం గ్రోత్​ సాధిస్తాయని ఎన్​ఎస్​ఓ ఎస్టిమేట్​ చేస్తోంది. ఇక వ్యవసాయ రంగం 3.9 శాతం పెరుగుతుందని వెల్లడించింది.