అమెరికన్ కంపెనీ ‘ఇండియన్ మోటార్సైకిల్’ మార్కెట్లోకి సోమవారం ‘ఎఫ్టీఆర్ 1220 ఎస్’ మోడల్ను విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్-షోరూం ధర రూ.15.99 లక్షలని తెలిపింది. మరో మోడల్ ఎఫ్టీఆర్ 1220 ఎస్ రేస్ రెప్లికా ధర రూ.17.99 లక్షలని పేర్కొంది. లీజు ద్వారా ఈ బైక్స్ను ఉపయోగించుకునేందుకు ఈ సందర్భంగా ఓరిక్స్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 4.3 ఇంచుల ఎల్సీడీ టచ్స్క్రీన్, సెన్సిటివ్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, 3 రైడ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
