
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీ కంటెంట్ ను నిలిపివేయాలని ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు గురువారం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘భారత్లోని అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు, మీడియా స్ట్రీమింగ్ సంస్థలు పాకిస్తానీ వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్ను వెంటనే నిలిపివేయాలి.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం” అని కేంద్రం తెలిపింది. అంతక మందు పాక్ కు చెందిన డాన్, జియో న్యూస్ వంటి ప్రధాన మీడియా సంస్థలు, 15కిపైగా పాకిస్తానీ యూట్యూబ్ చానెళ్లను ఇండియా నిషేధించింది.