
న్యూఢిల్లీ: ఎఫ్ఐహెచ్ జూనియర్ విమెన్స్ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ నేపథ్యంలో.. ఇండియా జూనియర్ హాకీ టీమ్ యూరోప్లో పర్యటించనుంది. ఈ నెల 8 నుంచి 17 వరకు బెల్జియం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్తో ఐదు మ్యాచ్లు ఆడనుంది. ఇటీవలే అర్జెంటీనాలో నాలుగు దేశాల టోర్నీ ఆడిన జట్టు డైరెక్ట్గా బెల్జియం వెళ్లనుంది. ఆంట్వెర్ప్లో ఇండియా.. బెల్జియంతో మూడు మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత ఆసీసీ, నెదర్లాండ్స్తో ఒక్కో మ్యాచ్లో తలపడుతుంది.
ఇక అర్జెంటీనాలో జరిగిన టోర్నీలో చిలీ, అర్జెంటీనాతో జరిగిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్కోసారి గెలిచింది. ఉరుగ్వేపై మాత్రం రెండింటిలోనూ నెగ్గింది. విభిన్న పరిస్థితుల్లో బలమైన ఇంటర్నేషనల్ ప్రత్యర్థులను ఎదుర్కోవడం వల్ల జట్టును తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని కోచ్ తుషార్ ఖండ్కర్ అన్నాడు. ‘ఈ టూర్ మా జట్టుకు అద్భుతమైన అవకాశం. అర్జెంటీనాలో మాకు మంచి ఎక్స్పీరియెన్స్ వచ్చింది. ఇప్పుడు బెల్జియం, ఆసీస్, నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్ల్లో మరింత ఉత్సాహంగా ఆడతాం’ అని పేర్కొన్నాడు.