
అంట్వెర్ప్: యూరోప్ టూర్లో ఇండియా జూనియర్ విమెన్స్ హాకీ టీమ్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఇండియా 2–1తో బెల్జియంపై నెగ్గింది. లాల్తాంట్లువాంగి (35వ ని), గీతా యాదవ్ (50వ ని) ఇండియాకు గోల్స్ అందించగా, జర్మనీ తరఫున వాన్ హిలీమోంట్ (48వ ని) ఏకైక గోల్ సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఇండియా బెల్జియం డిఫెన్స్పై ఎదురుదాడి చేసింది.
దాంతో వరుసగా లభించిన రెండు పెనాల్టీ స్ట్రోక్స్లో ఒకదాన్ని గోల్గా మలిచారు. తర్వాత బెల్జియం స్కోరును సమం చేసిన రెండు నిమిషాల తర్వాత గీతా సూపర్ ఫీల్డ్ గోల్తో ఇండియా ఆధిక్యాన్ని డబుల్ చేసింది. చివరి 10 నిమిషాల్లో బెల్జియం అటాకింగ్ గేమ్ ఆడినా ఇండియా డిఫెన్స్ అద్భుతంగా నిలువరించింది. గురువారం జరిగే మూడో మ్యాచ్లో ఇండియా.. బెల్జియంతోనే తలపడుతుంది.