
న్యూఢిల్లీ: అర్జెంటీనాలోని రొసారియోలో జరుగుతున్న నాలుగు దేశాల జూనియర్ విమెన్స్ ఫ్రెండ్లీ హాకీ టోర్నమెంట్లో యంగ్ ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో షూటౌట్లో 1-–3 తేడాతో చిలీ చేతిలో పరాజయం పాలైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–-2తో సమంగా నిలవడంతో మ్యాచ్ షూటౌట్కు దారితీసింది. సుఖ్వీర్ కౌర్ (35వ నిమిషం), కనికా సివాచ్ (47వ ని) గోల్స్ చేయగా.. చిలీ జట్టులో జసింటా సోలారి (27వ ని), కెప్టెన్ లారా ముల్లర్ (42వ ని) గోల్స్ సాధించారు. షూటౌట్లో చిలీ తరఫున గుటిరెజ్, మెసెన్, బారియోస్ గోల్స్ కొట్టగా.. ఇండియా నుంచి సోనమ్ మాత్రమే ఏకైక గోల్ చేయగలిగింది. ఆదివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్లో ఇండియా .. ఉరుగ్వేతో తలపడనుంది.