చరిత్ర సృష్టించిన ఇండియన్ మెన్స్ స్క్వాష్ టీమ్

చరిత్ర సృష్టించిన ఇండియన్ మెన్స్ స్క్వాష్ టీమ్

ఇండియన్ మెన్స్ స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది.  ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకంతో రికార్డు క్రియేట్ చేసింది. కువైట్‌తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోసల్ దుమ్మురేపారు. ఫస్ట్ మ్యాచ్ లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్‌కు ఆధిక్యం అందించాడు.

ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో సౌరవ్ ఘోసల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్  ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్ ను నిర్వాహకులు క్యాన్సిల్ చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత మెన్స్ టీమ్ 2-0 తేడాతో కువైట్‌ను మట్టికరిపించి  గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుంది. 

గోల్డే లక్ష్యంగా...
ఈ టోర్నీలో గతంలో రెండుసార్లు భారత్ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది.  సెమీస్ లో మలేషియాపై  2-1తో గెలిచి ఫైనల్ చేరింది.

ఉమెన్స్కు బ్రౌంజ్
ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళలు...బ్రౌంజ్ మాత్రమే సాధించారు. టోర్నీలో రెండు విజయాలు, ఒక ఓటమితో పూల్-బిలో రెండో స్థానంలో నిలిచింది. ఇరాన్, సింగపూర్లను 3-0 తేడాతో ఓడించిన ఉమెన్స్ టీమ్ ...హాంగ్ కాంగ్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత సెమీస్లో  మలేషియా చేతిలోనూ  1-2 తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో బ్రౌంజ్ సాధించారు.