మీడియం రేంజ్​ మిస్సైల్ ​ప్రయోగం విజయవంతం

మీడియం రేంజ్​ మిస్సైల్ ​ప్రయోగం విజయవంతం

అమరావతి : వైజాగ్​లోని ఐఎన్​ఎస్ ​యుద్ధనౌక నుంచి ఇండియన్​ నేవీ.. మీడియం రేంజ్ ​మిస్సైల్​ను విజయవంతంగా ప్రయోగించింది. ఎంఆర్​ఎస్​ఏఎం క్షిపణులకు యాంటీషిప్​ మిస్సైళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉందని నేవీ అధికారులు తెలిపారు. డీఆర్డీవో, ఐఏఐ ఉమ్మడిగా ఈ మిస్సైల్​ను అభివృద్ధి చేశాయి. దీన్ని బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది. ఆత్మనిర్భర్ భార‌త్‌కు ఇదే సాక్ష్యమ‌ని ఇవాళ నేవీ ఓ ప్రక‌న‌ట‌లో తెలిపింది. ఈ విషయాన్ని ఇండియన్​ నేవీకి చెందిన ఓ అధికారి సోషల్​ మీడియాలో వెల్లడించారు.