
అమరావతి : వైజాగ్లోని ఐఎన్ఎస్ యుద్ధనౌక నుంచి ఇండియన్ నేవీ.. మీడియం రేంజ్ మిస్సైల్ను విజయవంతంగా ప్రయోగించింది. ఎంఆర్ఎస్ఏఎం క్షిపణులకు యాంటీషిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉందని నేవీ అధికారులు తెలిపారు. డీఆర్డీవో, ఐఏఐ ఉమ్మడిగా ఈ మిస్సైల్ను అభివృద్ధి చేశాయి. దీన్ని బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్కు ఇదే సాక్ష్యమని ఇవాళ నేవీ ఓ ప్రకనటలో తెలిపింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీకి చెందిన ఓ అధికారి సోషల్ మీడియాలో వెల్లడించారు.