
న్యూఢిల్లీ : ఫ్యూయెల్ మార్కెటింగ్, రిఫైనింగ్లలో మార్జిన్లు పెరగడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) నికరలాభం మార్చి 2023 క్వార్టర్లో 67 శాతం పెరిగి రూ. 10,058.69 కోట్లకి చేరింది. 2021–22 మార్చి క్వార్టర్లో ఐఓసీ నికరలాభం రూ. 6,021.88 కోట్లే. నాలుగో క్వార్టర్లో లాభం బాగా పెరగడంతో పూర్తి ఫైనాన్షియల్ ఇయర్కు కూడా ఐఓసీ లాభాల్లోకి రాగలిగింది. 2022–23 ఫైనాన్షియల్ ఇయర్కు ఐఓసీ రూ. 8,241.82 కోట్ల నికరలాభం ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లను పెంచకపోవడం వల్ల 2022–23 ఫైనాన్షియల్ ఇయర్ మొదటి ఆరు నెలల్లో ఐఓసీకి నష్టాలే వచ్చాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ఇప్పటికీ పెరగకుండానే చూస్తున్నప్పటికీ, గ్లోబల్గా క్రూడ్ రేట్లు తగ్గడం కలిసి వచ్చింది. కిందటేడాది ఏప్రిల్6 నుంచి ఇప్పటిదాకా దేశంలో పెట్రో రేట్లను పెంచలేదు. క్రూడాయిల్ బ్యారెల్ ధర ఈ ఏడాది ఏప్రిల్లో 100 డాలర్ల దాకా ఉండగా, ఇప్పుడు 75 డాలర్లకు తగ్గింది.