
లండన్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో.. శుభ్మన్ గిల్ సారథ్యంలోని కొత్త టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. ఆదివారం (June 8) లార్డ్స్లో హై ఇంటెన్సిటీ ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంది.
పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్తో పాటు గిల్, రిషబ్ పంత్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ సెషన్లో పాల్గొన్నారు. కోచ్ గంభీర్ దీన్ని పర్యవేక్షించాడు. టీమిండియాకు 37వ టెస్ట్ కెప్టెన్గా నియమితుడైన గిల్.. 2007 తర్వాత ఇంగ్లండ్లో మన జట్టుకు తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించాలని భావిస్తున్నాడు.
పలువురు యంగ్స్టర్స్తో తో కూడిన టీమ్ను నడిపించేందుకు అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు. ఈ నెల 20 నుంచి లీడ్స్లో తొలి టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవర్లో మ్యాచ్లు ఉంటాయి. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు టెస్టు జట్టులోని కొంత మంది ప్లేయర్లు ఇంగ్లండ్ లయన్స్తో అనధికార టెస్టు మ్యాచ్ల్లో బరిలోకి దిగారు.