
ఈ ఏడాది చివర్లో ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్నకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇండియా విమెన్స్ టీమ్ సెప్టెంబర్లో సొంతగడ్డపై ఆస్ట్రేలియా అమ్మాయిలతో మూడు వన్డేల సిరీస్ ఆడనుందని బీసీసీఐ గురువారం ప్రకటించింది. దీంతోపాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మెన్స్ ‘ఎ’ జట్లు సెప్టెంబర్– -నవంబర్ లో ఇండియాలో పర్యటిస్తాయని తెలిపింది. ఈ టూర్లో భాగంగా ఇరు జట్లు.. ఆతిథ్య దేశంతో పలు అనధికారిక టెస్టు (నాలుగు రోజుల మ్యాచ్లు), వన్డేలు ఆడతాయని వెల్లడించింది. ఈ టూర్లకు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేసింది. ఇండియా, అస్ట్రేలియా విమెన్స్ వన్డే సిరీస్లోని మూడు వన్డేలకు చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ మ్యాచ్లు సెప్టెంబర్ 14, 17,20వ తేదీల్లో జరుగతాయి. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు పలు వేదికల్లో జరగనుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా మెన్స్–ఎ టీమ్ కూడా రెండు అనధికార టెస్టులు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ కోసం ఇండియాకు రానుంది. సెప్టెంబర్ 16–-19 మధ్య లక్నోలో జరిగే తొలి పోరుతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23-–26 మధ్య అదే వేదికపై జరుగుతుంది. అనంతరం మూడు వన్డే మ్యాచ్లు కాన్పూర్లో సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5వ తేదీల్లో జరుగుతాయిని బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్ తర్వాత అక్టోబర్–-నవంబర్లో సౌతాఫ్రికా –ఎ జట్టుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టూర్లో సఫారీ కుర్రాళ్ల జట్టు రెండు 4 రోజుల మ్యాచ్లతో పాటు మూడు వన్డేల్లో పోటీ పడనుంది. అనధికార టెస్టులు (అక్టోబర్ 30–నవంబర్ 2; నవంబర్ 6–9) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో జరుగుతాయి. మూడు వన్డే మ్యాచ్లు (నవంబర్ 13, 16, 19) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.
ఆస్ట్రేలియా విమెన్స్ టూర్:
సెప్టెంబర్ 14 తొలి వన్డే చెన్నై
సెప్టెంబర్ 17 రెండో వన్డే చెన్నై
సెప్టెంబర్ 20 మూడో వన్డే చెన్నై
ఆస్ట్రేలియా మెన్స్-ఎ టీమ్ టూర్:
సెప్టెంబర్ 16-19 తొలి టెస్ట్ లక్నో
సెప్టెంబర్ 23-26 రెండో టెస్ట్ లక్నో
సెప్టెంబర్ 30 తొలి వన్డే కాన్పూర్
అక్టోబర్ 3 రెండో వన్డే కాన్పూర్
అక్టోబర్ 5 మూడో వన్డే కాన్పూర్
సౌతాఫ్రికా మెన్స్-ఎ టీమ్ టూర్
అక్టోబర్ 30-నవంబర్ 2 తొలి టెస్ట్ బెంగళూరు
నవంబర్ 6-9 రెండో టెస్ట్ బెంగళూరు
నవంబర్ 13 తొలి వన్డే బెంగళూరు
నవంబర్ 16 రెండో వన్డే బెంగళూరు
నవంబర్ 19 మూడో వన్డే బెంగళూరు