వరల్డ్​ క్యాడెట్‌‌‌‌ చెస్​ నుంచి వైదొలిగిన ఇండియా

వరల్డ్​ క్యాడెట్‌‌‌‌ చెస్​ నుంచి వైదొలిగిన ఇండియా

చెన్నై: వరల్డ్‌‌‌‌ క్యాడెట్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ నుంచి ఇండియా వైదొలిగింది. ఇజ్రాయిల్‌‌‌‌–హమాస్‌‌‌‌ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి 23 వరకు జరగాల్సిన టోర్నీలో ఇండియా నుంచి 39 మంది ప్లేయర్లు బరిలోకి దిగాల్సి ఉంది. అండర్‌‌‌‌–12, 10, 8 కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయి. పోటీలు జరగాల్సిన వేదిక.. ఇజ్రాయిల్‌‌‌‌ బోర్డర్‌‌‌‌కు 400 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాడులు జరగొచ్చన్న అనుమానంతో టోర్నీని వాయిదా వేయాలని ఆలిండియా చెస్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ (ఏఐసీఎఫ్‌‌‌‌).. వరల్డ్​ చెస్​ ఫెడరేషన్​ (ఫిడే)ను కోరింది.