ఫేస్బుక్ ప్రియుడి కోసం ..పాకిస్తాన్కు వెళ్లిన భారత మహిళ

ఫేస్బుక్ ప్రియుడి కోసం ..పాకిస్తాన్కు వెళ్లిన  భారత మహిళ

బ్జీ ప్రేమ  ఓ మహిళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే..ఫేస్బుక్ ప్రేమ మరో మహిళను భారత్ నుంచి పాకిస్తాన్కు తీసుకెళ్లింది. పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ పబ్జీ  ప్రియుడు కోసం నలుగురు పిల్లలతో సరిహద్దును దాటితే...ఫేస్ బుక్ లో పరిచయమైన ప్రియుడి కోసం మహిళ..పిల్లలను ఇండియాలోనే వదిలేసి పాకిస్తాన్ కు వెళ్లింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరా మహిళ...వివరాల్లోకి వెళ్తే..

ఫేస్ బుక్ లో పరిచయం..ప్రేమగా 

 అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళకు ఫేస్ బుక్ ద్వారా పాకిస్తాన్ లోని ఖైబర్ పల్తున్వా ప్రావిన్స్  దీర్ సిటీకి చెందిన 29 ఏళ్ల నస్రుల్లా ఖాన్ కు పరిచయమైంది. వీరిద్దరు తరచూ చాటింగ్ చేసుకుంటూ స్నేహితులుగా మారారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే అంజును పాకిస్తాన్ రావాల్సిందిగా నస్రుల్లా ఖాన్ కోరాడు. ప్రియుడి పిలుపు మేరకు జులై 21వ తేదీన  అంజు..భారత సరిహద్దును దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. 

అంజుకు అల్రెడీ పెళ్లయింది..

రాజస్థాన్లోని భివాడి జిల్లాకు చెందిన అంజుకు ఇదివరకే పెళ్లయింది. అరవింద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అంజుకు ఇద్దరు పిల్లలు. వీరు అంజు సోదరుడితో కలిసి భివాడిలోని అద్దె ఫ్లాట్లో నివసిస్తున్నారు. అరవింద్ భివాడిలో పనిచేస్తున్నాడు. అంజు కూడా ఒక ప్రైవేట్ సంస్థలో ఐయోడేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తోంది.  అంజు అరవింద్ కలిసి క్రైస్తవ మతంలోకి మారడంతో వివాహం చేసుకున్నారు.

ALSO READ:ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనీయులు

జైపూర్ కు వెళ్లొస్తా అని చెప్పి...

కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో నస్రుల్లా ఖాన్ తో చాట్ చేస్తున్న అంజు..ప్రియుడు ఆహ్వానం మేరకు పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో జైపూర్ కు వెళ్లొస్తా అని చెప్పి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం  భర్త అరవింద్ తెలిసింది. స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి అంజు ఇంట్లో నుంచి వెళ్లిందని భర్త అరవింద్ చెప్పాడు. జులై 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు అంజు తనకు ఫోన్ చేసిందని..తాను లాహోర్లో ఉన్నానని..రెండు మూడు రోజుల్లో తిరిగివస్తానని చెప్పినట్లు అరవింద్ వివరించాడు. అంజు తన ప్రియుడు కోసం  పాకిస్తాన్ వెళ్లిందన్న వార్తలను అరవింద్ లైట్ తీసుకున్నాడు. తన భార్య ఖచ్చితంగా తన దగ్గరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

అన్ని పత్రాలతో పాక్కు పయనం..

 జైపూర్ కు  వెళ్లే నెపంతో అంజు భివాడిలోని తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ పాకిస్తాన్ లోని  తన 29 ఏళ్ల ఫేస్బుక్ ప్రియుడిని నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్ వెళ్లినట్లు తెలిసింది. అయితే ఇంటి నుంచి బయలుదేరిన అంజు..మొదట పోలీసు కస్టడీలో ఉందని తెలుస్తోంది. అయితే ఆమె ప్రయాణ పత్రాలను ధృవీకరించిన తర్వాత అంజును విడుదల చేశారని సమాచారం.  పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని గుర్తించిన భద్రతా సిబ్బంది..అంజును పాక్ వెళ్లేందుకు అనుమతించారు.  

మొత్తానికి సోషల్ మీడియా రెండు దేశాలకు చెందిన మనుషుల మధ్య ప్రేమను పుట్టించింది. భర్త, పిల్లలను కాదనుకుని అంజు పాకిస్తాన్ కు వెళ్లింది. అయితే ఆమె మళ్లీ వస్తుందా అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ భర్త అరవింద్ మాత్రం తన భార్య వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. అయితే పాక్ వెళ్లిన అంజు..అక్కడ నస్రుల్లాను కలిసిందా..లేక కలవలేదా అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది.