ముంబై: ఇంగ్లండ్ టూర్కు ఎంపికైన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్లోని ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ అంతా తమ ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గురువారంతో విమెన్స్ టీమ్ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యిందని బీసీసీఐకి చెందిన ఓఅధికారి తెలిపారు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఆల్రౌండర్ దీప్తి శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, జూన్ 16న మొదలయ్యే సిరీస్లో ఇండియా– ఇంగ్లండ్ విమెన్స్ జట్ల మధ్య ఓ టెస్ట్, మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ టూర్కు ఎంపికైన వారంతా ఇప్పటికే ముంబై చేరుకుని క్వారంటైన్లో ఉన్నారు. జూన్ 2న మెన్స్ టీమ్తో కలిసి యూకే బయలుదేరుతారు. విమెన్స్ టీమ్లో చాలా మంది తమ ఇళ్ల వద్ద ఉన్నప్పుడే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మిస్ అయిన వాళ్లు..క్వారంటైన్ ఫెసిలిటీలో వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. టీమ్లో ఎక్కువ మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.