విమెన్​ క్రికెటర్లకు  ఫస్ట్​ డోస్​ వ్యాక్సిన్

విమెన్​ క్రికెటర్లకు  ఫస్ట్​ డోస్​ వ్యాక్సిన్

ముంబై:  ఇంగ్లండ్​ టూర్‌‌కు ఎంపికైన ఇండియా విమెన్స్​ క్రికెట్​ టీమ్​లోని ప్లేయర్లు, సపోర్ట్​ స్టాఫ్​ అంతా తమ ఫస్ట్​ డోస్ కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. గురువారంతో విమెన్స్​ టీమ్​ ఫస్ట్​ డోస్​ వ్యాక్సినేషన్​ కంప్లీట్​ అయ్యిందని బీసీసీఐకి చెందిన ఓఅధికారి తెలిపారు. వ్యాక్సిన్​ తీసుకుంటున్న ఫొటోను  ఆల్​రౌండర్​ దీప్తి శర్మ సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, జూన్​ 16న మొదలయ్యే సిరీస్​లో ఇండియా– ఇంగ్లండ్​ విమెన్స్​ జట్ల​ మధ్య ఓ టెస్ట్​, మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ టూర్​కు ఎంపికైన వారంతా ఇప్పటికే ముంబై చేరుకుని క్వారంటైన్​లో ఉన్నారు. జూన్​ 2న మెన్స్​ టీమ్​తో కలిసి యూకే బయలుదేరుతారు. విమెన్స్​ టీమ్​లో చాలా మంది తమ ఇళ్ల వద్ద ఉన్నప్పుడే ఫస్ట్​ డోస్​ వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మిస్​ అయిన వాళ్లు..క్వారంటైన్​ ఫెసిలిటీలో వ్యాక్సినేషన్​ చేయించుకున్నారు. టీమ్​లో ఎక్కువ మందికి  కోవిషీల్డ్​ వ్యాక్సిన్​  అందించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.