మంచి ఆహారం తినకపోవడం వల్లే ఇండియాలో మరణాలు

మంచి ఆహారం తినకపోవడం వల్లే ఇండియాలో మరణాలు
  • మన దేశానికి చెందిన యూకే డాక్టర్‌‌ వెల్లడి

లండన్‌: మన దేశంలో మంచి ఆహారం తినకపోవడం వల్లే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఇండియన్‌ ఆర్జిన్‌ యూకే డాక్టర్‌, యూకే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) అస్సీమ్‌ మల్హోత్ర అన్నారు. ఇప్పటికైనా అల్ట్రా ప్రాసెసడ్‌ ఫుడ్‌ తినడం మానేసి వైరస్‌ బారిన పడకుండా మంచి ఫుడ్‌ తీసుకోవాలని చెప్పారు. ఒబెసిటీ, అధిక బరువు వల్ల కూడా ఇబ్బంది ఉంటుందని అన్నారు. “ వ్యాధుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేలా ఇండియా జీవనశైలి ఉంటుంది. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌, బీపీ, గుండె జబ్బులు లాంటి పరిస్థితులు కరోనా సోకేందుకు ప్రధాన కారణం. శరీరంలో ఉండే ఫ్యాట్‌ వల్ల ఇవి వస్తాయి. అలాంటి వాళ్ల సంఖ్య అక్కడ ఎక్కువగానే ఉంది” అని అన్నారు. ఇండియన్స్‌ ప్యాకేజ్‌ ఫుడ్‌ పక్కన పెట్టాలని, చిరుతిండి కాకుండా చక్కగా వండుకొని తినాలని సూచించారు. యూఎస్‌, యూకేలో అలాంటి ఫుడ్‌ తిని అందరూ ఓవర్‌‌ వెయిట్‌ అయిపోయారని, దాని వల్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా రిఫైండ్‌ కార్బొహైడ్రేట్స్‌ తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, దాని ప్లేస్‌లో కూరగాయలు, పండ్లు తీసుకోవాలని అన్నారు. రెడ్‌ మీట్‌, డైరీ ప్రాడెక్ట్స్‌, గుడ్లు, చెప లాంటివి కూడా మంచి ఆహారం అని చెప్పారు.