
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇండియా టీమ్ స్వర్ణాల మోత మోగించింది. రెండో, చివరి రోజైన ఆదివారం ఆరు బంగారు పతకాలు గెలుచుకుంది. మరో మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 10 మెడల్స్ ఖాతాలో వేసుకుంది. విమెన్స్ 800మీ, లాంగ్ జంప్ ఈవెంట్లలో డబుల్ పోడియం ఫినిష్తో సత్తా చాటింది.
మూడు సార్లు నేషనల్ చాంపియన్ విత్య రామ్రాజ్తో పాటు రోహిత్ యాదవ్, పూజ, క్రిషన్ కుమార్, అన్ను రాణి తమ ఈవెంట్లలో స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. మెన్స్ 4x400 మీటర్ల రిలేలో ఇండియా టీమ్ గోల్డ్ మెడల్తో ఈ టోర్నీకి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. విత్య విమెన్స్ 400 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో 56.53 సెకన్ల టైమింగ్తో స్వర్ణం గెలుచుకుంది.
ఈ ఏడాది ఆమెకు ఇది మూడో బెస్ట్ టైమింగ్ కావడం విశేషం. రోహిత్ యాదవ్ మెన్స్ జావెలిన్ త్రో పోటీలో 75 మీటర్ల మార్కును దాటకపోయినప్పటికీ 74.42 మీటర్ల బెస్ట్ త్రోతో గోల్డ్ ఖాతాలో వేసుకున్నాడు. 800 మీటర్ల ఫైనల్లో పూజ 2 నిమిషాల 02.79 సెకండ్లతో చాంపియన్షిప్ రికార్డు టైమింగ్ నమోదు చేస్తూ స్వర్ణం సాధించింది. ఇదే పోటీలో ట్వింకిల్ చౌదరి 2 నిమిషాల 06.96 సెకండ్లతో రజతం నెగ్గింది.
మెన్స్ 800 మీటర్ల ఫైనల్లో క్రిషన్ కుమార్ తొలుత వెనుకబడినప్పటికీ పుంజుకుని 1 నిమిషం48.46 సెకండ్లతో కొత్త చాంపియన్షిప్ రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలిచాడు. జావెలిన్ ఫైనల్లో అన్ను రాణి 56.82 మీటర్ల దూరంతో టాప్ ప్లేస్లో నిలిచి బంగారు పతకాన్ని అందుకుంది. మెన్స్ 400 మీటర్ల హర్డిల్స్లో యశస్ పాలక్షా తన పర్సనల్ బెస్ట్ టైమింగ్ (42.22 సె)తో రజతం సాధించాడు.
విమెన్స్ లాంగ్ జంప్లో శైలీ సింగ్ (6.41 మీ) రజతం, అన్సీ సోజన్ (6.39 మీ) కాంస్యం నెగ్గారు. ఇక ఆఖరిదైన మెన్స్ 4x400 మీటర్ల రిలేలో సంతోష్ టి. విశాల్ టీకే, ధరమ్వీర్ చౌదరి, మను టీఎస్తో కూడిన ఇండియా టీమ్ 3 నిమిషాల 05.58 సెకండ్లతో టాప్ ప్లేస్ సొంతం చేసుకొని టోర్నీని ముగించింది.