ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2023 సెప్టెంబర్ 20 బుధవారం రోజున ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకునన్నాడు. ఈ మ్యాచ్ కు ముందు సిరాజ్ 9 వస్థానంలో ఉన్నాడు. కానీ తాజాగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో అదరగొట్టి 694 పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎకబాకి నంబర్ వన్ స్థానాన్ని దక్కి్ంచుకున్నాడు.
సిరాజ్ దెబ్బకు నంబర్ వన్ ర్యాంక్లో నిలిచిన ఆస్ట్రేలియాకు చెందిన జోస్ హెజిల్వుడ్ సెకండ్ ప్లేస్కు పడిపోయాడు. బౌల్ట్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక శుభ్మన్ గిల్ 814 రేటింగ్ పాయింట్లతో నంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి 708 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకగా,రోహిత్ శర్మ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ కేవలం 21 పరుగులిచ్చి కీలకమైన ఆరు వికెట్లు తీశాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చరిత్రను సృష్టించాడు. సిరాజ్ దెబ్బకు లంక బ్యాట్స్ మెన్స్ 50 పరుగులకే వెనుదిరిగారు.