
న్యూఢిల్లీ : ఇండియా స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ఆసియా గేమ్స్లో పోటీపడే ఇండియా బాక్సింగ్ టీమ్కు ఎంపికైంది. చైనాలోసెప్టెంబర్లో జరిగే ఈ గేమ్స్కు ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ జట్లను శనివారం ప్రకటించారు. వరల్డ్ చాంపియన్స్ హోదాలో నిఖత్ జరీన్ (51 కేజీ), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీ) డైరెక్ట్ బెర్తులు సాధించారు. గాయం నుంచి కోలుకోని వరల్డ్ బాక్సింగ్ బ్రాంజ్ మెడలిస్ట్, తెలంగాణకు చెందిన మహ్మద్ హుస్సాముద్దీన్ ఎంపికవ్వలేదు. స్టార్ బాక్సర్ అమిత్ పంఘల్ ఈ సీజన్ ఆసియా గేమ్స్కు దూరం అయ్యాడు. అతని వెయిట్ కేటగిరీలో దీపక్ భోరియా (51 కేజీ)కు చాన్స్ వచ్చింది.
విమెన్స్ టీమ్ : నిఖత్ జరీన్ (51 కేజీ), ప్రీతి (54 కేజీ), పర్వీన్ హుడా (57 కేజీ), జాస్మిన్ (60 కేజీ), అరుంధతి (66 కేజీ), లవ్లీనా (75 కేజీ).
మెన్స్ టీమ్ : దీపక్ భోరియా (51 కేజీ), సివాచ్ (57 కేజీ), శివ థాపా (63.5 కేజీ), నిశాంత్ దేవ్ (71 కేజీ), లక్ష్య చహర్ (80 కేజీ), సంజీత్ (92 కేజీ), నరేంద్ర బెర్వాల్ (+92 కేజీ).