కౌలాలంపూర్ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధుకు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో కఠినమైన డ్రా ఎదురైంది. విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్ బై పొందిన ఇండియన్ ప్లేయర్.. తర్వాతి రౌండ్లలో రత్చనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్), టాప్సీడ్ అన్ సీ యంగ్ (కొరియా)తో తలపడనుంది. 2019లో టైటిల్ నెగ్గిన సింధు ఇండియా నుంచి విమెన్స్ సింగిల్స్లో బరిలో ఉన్న ఏకైక ప్లేయర్. మెన్స్ డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టికి తొలి రౌండ్లో బై లభించింది. మెన్స్ సింగిల్స్లో హెచ్.ఎస్. ప్రణయ్.. కాలీ కొలిజోనెన్ (ఫిన్లాండ్)తో ఆట మొదలుపెట్టనున్నాడు.
తొలి రౌండ్లో లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్.. జార్జెస్ జూలియన్ పాల్ (మారిషస్), కెంటా నిషిమోటో (జపాన్)ను ఎదుర్కోనున్నారు. విమెన్స్ డబుల్స్లో ట్రిసా జోలీ–గాయత్రి గోపీచంద్కు తొలి రౌండ్లో బై పొందారు. అశ్విన్ భట్–శిఖా గౌతమ్.. డెబోరా జూలీ–చెర్యాల్ సీనెన్ (నెదర్లాండ్స్)తో, మిక్స్డ్లో రోహన్ కపూర్–సిక్కి రెడ్డి.. ఆమ్ హాల్–జూలీ మాక్పెర్సన్తో తలపడనున్నారు. మెన్స్ సింగిల్స్లో 64, విమెన్స్లో 48 మంది బరిలో ఉన్నారు.