న్యూఢిల్లీ: డిసెంబర్ 2022 క్వార్టర్లో ఇండిగో ఎయిర్లైన్స్ను నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ నికరలాభం 1000 శాతం పెరిగి రూ. 1,422.6 కోట్లకు చేరింది. దేశంలో ఎయిర్ట్రావెల్ మళ్లీ జోరందుకోవడంతో కంపెనీ మెరుగైన పనితీరు కనబరిచింది. అంతకు ముందు ఏడాది క్యూ 3 లో ఇండిగో నికరలాభం రూ. 129.8 కోట్లు మాత్రమే. తాజా క్యూ 3 లో రెవెన్యూ రూ. 15,410 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ 2021 క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 9,480 కోట్లు.
ఆపరేషనల్గాను, ఫైనాన్షియల్గానూ మూడో క్వార్టర్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉందని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. ఆర్గనైజేషన్లో తీసుకొచ్చిన మార్పులు ఫలితాలు ఇవ్వడం మొదలైందని పేర్కొన్నారు. 300 ఎయిర్క్రాఫ్ట్లతో ప్రస్తుతం సేవలు అందిస్తున్నామని, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సెక్టార్లలో కెపాసిటీ పెంచే ప్రయత్నాలలో ఉన్నామని వివరించారు. రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈ ట్రేడింగ్లో ఇండిగో షేర్లు 1.2 శాతం తగ్గి రూ. 2,100 వద్ద ముగిశాయి.