కాంగ్రెస్ కు ఇందిరా శోభన్ రాజీనామా

కాంగ్రెస్ కు ఇందిరా శోభన్ రాజీనామా

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఇందిరా శోభన్ గుడ్ బై చెప్పారు. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏడేళ్లుగా తనకు అండగా ఉన్న కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు ఇందిరా శోభన్. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరు తనను బాధ పెట్టిందని ..వారి వైఖరికి నిరసనగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మహిళా నాయకురాలిగా తీవ్ర ఆవేదన చెందానని తెలిపారు. త్వరలోనే వైస్ షర్మిల పెట్టే కొత్త పార్టీలో జాయిన్ కానున్నట్లు చెప్పిన ఇందిరా శోభన్.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు.