వైస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ గుడ్ బై

వైస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్  గుడ్ బై
  • పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన 
  • భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్న ఇందిరా శోభన్

హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేత ఇందిరా శోభన్ గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు ఇన్నిరోజులు సపోర్ట్, ప్రోత్సాహం అందించిన వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని ఇందిరా శోభన్ చెప్పారు. తెలంగాణ సాధన కోసం కొట్లాడానని...ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నానని ఇందిరా శోభన్ చెప్పారు. అమరవీరుల ఆశయాల సాధన, ఉద్యోగాలు, మహిళలకు సమాన హక్కుల కోసం ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటానన్నారు. అందుకు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. శ్రేయోభిలాషులు కోరినందున పార్టీకీ రాజీనామా చేశానన్నారు ఇందిరా శోభన్.