ఆర్మూర్ లో అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు :  చైర్మన్ సాయిబాబాగౌడ్

 ఆర్మూర్ లో అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు :  చైర్మన్ సాయిబాబాగౌడ్
  • ఆర్మూర్​ వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ 

​ఆర్మూర్​, వెలుగు :  అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతున్నాయని ఆర్మూర్​ వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్ అన్నారు. మంగళవారం ఆర్మూర్​ టౌన్​ లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మున్సిపల్​ కమిషనర్ రాజు తో కలిసి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి పదేండ్లలో  ఒక్క ఇల్లు కట్టించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇండ్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ వీణ, కాంగ్రెస్​ నాయకులు రింగుల భూషణ్​, పూలనర్సయ్య, చిట్టిరెడ్డి, భూపేందర్, లక్ష్మణ్​, హరీశ్, ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి అడిషనల్​ కలెక్టర్​ చందర్ నాయక్​

పిట్లం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం పిట్లం, పెద్ద కొడప్​గల్​లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు.  లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో కమలాకర్, పంచాయతీ సెక్రటరీ బల్​రాం కాంగ్రెస్​ నాయకులు జంబిగె హన్మాండ్లు, మోహన్​రెడ్డి,  దయానంద్ తదితరులు పాల్గొన్నారు.