
- ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
ఆర్మూర్, వెలుగు : అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతున్నాయని ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్ అన్నారు. మంగళవారం ఆర్మూర్ టౌన్ లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మున్సిపల్ కమిషనర్ రాజు తో కలిసి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పదేండ్లలో ఒక్క ఇల్లు కట్టించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇండ్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ వీణ, కాంగ్రెస్ నాయకులు రింగుల భూషణ్, పూలనర్సయ్య, చిట్టిరెడ్డి, భూపేందర్, లక్ష్మణ్, హరీశ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్
పిట్లం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పిట్లం, పెద్ద కొడప్గల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కమలాకర్, పంచాయతీ సెక్రటరీ బల్రాం కాంగ్రెస్ నాయకులు జంబిగె హన్మాండ్లు, మోహన్రెడ్డి, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.