మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి : ఇంద్రకరణ్ రెడ్డి

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి : ఇంద్రకరణ్ రెడ్డి

మేడారం సమ్మక సారలమ్మ జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేసిన యాగాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరుగుతున్న అతి రుద్రయాగంలో పాల్గొన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.  మేడారం పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాగంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్  దాస్యం వినయ్  భాస్కర్ , ఎంపీ పసునూరి దయాకర్ , ఎమ్మెల్యే ఆరూరి రమేష్   పాల్గొన్నారు. ఇవాళ నుంచి వారం రోజుల పాటు యాగాన్ని నిర్వహించనున్నారు.