హైదరాబాద్, వెలుగు : చాలా సర్వీసులకు ఛార్జీలు లేని, మినిమం బాలెన్స్ అవసరం లేని ఒక సబ్స్క్రిప్షన్ బేస్డ్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ఫినిటీ పేరుతో యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం లాంఛ్ చేసింది. కస్టమర్లకు ఈ ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్ కోసం నెలకు రూ. 150 లేదా ఏడాదికి రూ. 1,650 చెల్లిస్తే సరిపోతుందని యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. అకౌంట్లో మినిమం బాలెన్స్ లేకపోతే చాలా బ్యాంకులు పెనాల్టీలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ శావీ కస్టమర్ల కోసం ఈ కొత్త ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్ను తీసుకొచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్ వివరించింది.
ఎస్ఎంఎస్ అలర్టులు, చెక్బుక్కులు వంటి సదుపాయాల కోసం కస్టమర్లు వేరుగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కస్టమర్ల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునే ఈ కొత్త తరహా సబ్స్క్రిప్షన్ బేస్డ్ సేవింగ్స్ అకౌంట్స్ను తెస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ రిటెయిల్ లయబిలిటీస్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. మినిమం బాలెన్స్ అవసరమే ఉండదని, డొమెస్టిక్ ట్రాన్సాక్షనల్ ఫీజులుండవని, ఎన్నిసార్లైనా డెబిట్కార్డుతో ఏటీఏం లావాదేవీలు జరపొచ్చని పేర్కొన్నారు. చెక్బుక్ వాడకంపై ఛార్జీలుండవని, లిమిట్స్కు మించిన విత్డ్రాయల్స్పైనా ఎలాంటి ఛార్జీలు విధించమని వివరించారు.