ఎస్సారెస్పీకి మళ్ళీ ఇన్ ఫ్లో

ఎస్సారెస్పీకి మళ్ళీ ఇన్ ఫ్లో

నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం మొదలైన తొలినాళ్లలోనే కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. భారీ వర్షాలకు ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వానల దాటికి వేల ఎకరాల్లో పంట నీటి మునిగింది. ఈ క్రమంలోనే జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండగా తయారైంది. ఎడతెరపిలేని వర్షాలకు వరద ప్రవాహం పెరిగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతుందనుకుంటున్న సమయంలోనే ఎస్సారెస్పీకి మళ్లీ ఇన్ ఫ్లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 48,850 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో.. అధికారులు 9 గేట్లను ఎత్తి 24,984 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1088.30 అడుగులకు చేరుకుంది . ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం  77.383 టీఎంసీలుగా నమోదైంది.