డీఎల్ఎఫ్​ స్ట్రీట్ రెస్టారెంట్లలో తనిఖీలు

డీఎల్ఎఫ్​ స్ట్రీట్ రెస్టారెంట్లలో తనిఖీలు
  • కిచెన్లలో బొద్దింకలు, పాడైన ఫుడ్​ ఐటమ్స్​ గుర్తింపు

గచ్చిబౌలి/సికింద్రాబాద్/వికారాబాద్, వెలుగు : గచ్చిబౌలి డీఎల్ఎఫ్​ఏరియాలోని స్ట్రీట్​ఫుడ్ రెస్టారెంట్లలో ఫుడ్​సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. సీనయ్య కిచెన్, కాయల్​కేరళ రెస్టారెంట్, కనుమ రెస్టారెంట్,  ఏఎమ్- పీఎం ఫుడ్​కోర్టు, మండీ డీఎల్ఎఫ్, నూడిల్​బార్ ను తనిఖీ చేశారు.

వీటిలోని కిచెన్లు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ను డిస్​ప్లే చేయకపోడంతోపాటు సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు తేల్చారు. కిచెన్లలో బొద్దింకలు తిరుగుతుండడం, పాడైన ఫుడ్ ఐటమ్స్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 

బేగంపేట న్యూఊర్వశి రెస్టారెంట్​లోనూ..

బేగంపేట పరిధిలోని న్యూఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్​లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు  చేశారు. కిచెన్​అపరిశుభ్రంగా ఉండడంతోపాటు ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు, పాడైపోయిన కూరగాయలను వాడుతున్నట్లు గుర్తించారు.

నాన్ వెజ్​ఫుడ్​ఐటమ్స్​లో సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు తేల్చారు. ఫ్రిడ్జ్​లో నిల్వ చేసిన ఫుడ్​ఐటమ్స్​పై లేబులింగ్ లేదని తెలిపారు. మటన్, చికెన్, ఇతర పదార్థాలను టెస్టింగ్​కోసం ల్యాబ్​కు పంపించనున్నట్లు వారు వెల్లడించారు.