LIC News: విమాన ప్రమాదంపై రంగంలోకి ఎల్ఐసీ.. కీలక ప్రకటన..

LIC News: విమాన ప్రమాదంపై రంగంలోకి ఎల్ఐసీ.. కీలక ప్రకటన..

Air India Crash: భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎయిర్ ఇండియా. కోట్ల మంది ప్రజలు తమ జీవిత బీమా అవసరాలకు సంస్థ అందించే అనేక పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ప్రమాదాల సమయంలో బాధిత కుటుంబాలకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్స్ సాఫీగా, వేగంగా పూర్తి చేసేందుకు ఎల్లప్పుడూ ముందుకొస్తూనే ఉంటుందని తెలిసిందే. 

ALSO READ | విమాన ప్రమాదం.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు

తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎల్ఐసీ నేడు కీలక ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. అయితే ఈ ప్రమాదం వల్ల మరణించిన అందరికి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ల విషయంలో తమ మద్ధతు ఉంటుందని, ఇది సదరు కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించటంలో దోహదపడుతుందని వెల్లడించింది. 

ఈ ప్రమాదం వల్ల మృతి చెందిన విమాన ప్రయాణికులతో పాటు విమానం కూలిన చోట మరణించిన వ్యక్తుల ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం కొన్ని కఠిన నిబంధనలను రిలాక్స్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రమాదంలో మరణించిన వారి డెత్ సర్టిఫికెట్ బదులుగా.. వారి మరణాన్ని సూచించే ప్రభుత్వ రికార్డులను అంగీకరించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా విమానయాన సంస్థ అందించిన ఏదైనా పరిహారాన్ని డెత్ సర్టిఫికెట్ బదులుగా అంగీకరించనున్నట్లు పేర్కొంది. 

బజాజ్ అలయన్జ్ ప్రకటన..
మరో బీమా సంస్థ బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రమాదంపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంబంధించిన పాలసీలను వేగవంతంగా ప్రాసెసింగ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక క్లెయిమ్ సెటిల్మెంట్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రమాదం వల్ల మృతి చెందిన వారికి సంబంధించిన డెత్ క్లెయమ్స్, డిసెబిలిటీ క్లెయమ్స్ ప్రాసెసింగ్ చేయనున్నట్లు పేర్కొంది.