ఎవరి ఆన్సర్​ షీట్​ వాళ్లకే: ఇంటర్ బోర్డు

ఎవరి ఆన్సర్​ షీట్​ వాళ్లకే: ఇంటర్ బోర్డు

హైదరాబాద్​, వెలుగు: వెబ్​సైట్​లో ఎవరి ఆన్సర్​ షీట్​ వాళ్లకే కనిపించేలా ఇంటర్​ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓపెన్​గా పెడితే అందరికీ తెలిసి విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫెయిలైన 3,82,116 మందికి సంబంధించిన 9,02,429 ఆన్సర్​ షీట్లను సోమవారం రాత్రి వెబ్​సైట్​లో అధికారులు అప్​లోడ్​ చేశారు. మరో 19 వేల ఆన్సర్​షీట్లను ఒకట్రెండు రోజుల్లో అప్​లోడ్​ చేస్తామన్నారు. పాసైన విద్యార్థుల జవాబు పత్రాలను 30న వెబ్​సైట్​లో పెడతామన్నారు. మంగళవారం సాయంత్రం నాటికి 38 వేల మంది ఆన్సర్​షీట్లను డౌన్​లోడ్​ చేసుకున్నట్టు
అధికారులు చెబుతున్నారు. ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూసిన విద్యార్థులు మారిన మార్కులను చూసి, వాటిని డౌన్​లోడ్​ చేసుకోకుండా వదిలేస్తున్నట్టు సమాచారం. ఆన్సర్​షీట్లను డౌన్​లోడ్​ చేసుకునే విధానంపైనా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఫెయిలయ్యానన్న మనస్తాపంతో హైదరాబాద్​లోని దమ్మాయిగూడకు చెందిన మానస (18) అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.