- పరీక్షల కారణంగా స్టూడెంట్స్లో పెరగనున్న టెన్షన్, ఒత్తిడి
- చదవమంటూ పేరెంట్స్ ప్రెషర్ చేయొద్దంటున్నసైకాలజిస్టులు
- ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ప్రభుత్వం టెలిమానస్ కౌన్సిలింగ్
హైదరాబాద్, వెలుగు : ఇయ్యాల్టి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్షురూ అవుతుండగా.. సాధారణంగా విద్యార్థులు భయానికి, ప్రెషర్కు లోనవుతుంటారు. ఇదే టైంలో టీచర్స్, పేరెంట్స్కూడా పిల్లలపై ఒత్తిడి పెంచేస్తుంటారు. పరీక్షలకు రెండు మూడు నెలల ముందునుంచే ఎక్స్ట్రా క్లాసులు, స్లిప్టెస్టులు, రివిజన్లు ఇలా తీరిక లేకపోవడంతో తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇయ్యాల్టి నుంచి ఇంటర్, మార్చి 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ నేపథ్యంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అతిగా ఒత్తిడికి గురిచేస్తే విద్యార్థుల మానసిక స్థితిపై ఎఫెక్ట్ చూపుతుందని పేర్కొంటున్నారు. మార్కులు ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేయొద్దని సూచిస్తున్నారు. విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ అంటే భయపడొద్దంటున్నారు. ‘‘ఎగ్జామ్స్ టైమ్ లో పేరెంట్స్, టీచర్స్నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇది సరైనది కాదు. ఎక్కువ ఒత్తిడికి లోను చేస్తే విద్యార్థులు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వారే సొంతంగా టైం టేబుల్ వేసుకుని చదివే విధంగా ప్రోత్సహించాలి ”అని సీనియర్
సైకాలజిస్ట్ పేర్కొన్నారు.
పేరెంట్స్ సపోర్టు అవసరం
ఎగ్జామ్స్ టైమ్లో పిల్లలకు పేరెంట్స్నుంచి ఎమోషనల్సపోర్టు అవసరం ఉంటుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ‘‘ తలనొప్పి, బాడీ పెయిన్స్, తల తిరగడం, వికారం, మతిమరుపు, భయం, అలసట, చదువుపై ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే.. వాటిపై శ్రద్ధ వహించి, ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. వీలైతే సైకాలజిస్ట్, కౌన్సెలర్ వద్దకు తీసుకెళ్లాలి”..అని సైకాలజిస్టులు సూచిస్తున్నారు .
టెలిమానస్ కౌన్సిలింగ్..
ఎగ్జామ్స్కారణంగా ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ప్రభుత్వం సైకాలజిస్టులతో టెలిమానస్ కౌన్సిలింగ్ ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేకంగా 14416, 1800914416 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కాల్ చేసి విద్యార్థులు, పేరెంట్స్అవసరమైన కౌన్సిలింగ్పొందవచ్చు. ‘‘ ప్రస్తుతం రోజూ పదుల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. పరీక్షల సమయంలో కాల్స్సంఖ్య పెరుగుతుంది. ఎక్కువగా పేరెంట్స్కాల్ చేస్తున్నారు’’ అని టెలిమానస్అధికారి తెలిపారు.
ప్లానింగ్ తో చదివితే ఈజీ
ప్లానింగ్ తో చదివితే ఎగ్జామ్స్ఈజీగా రాయొచ్చు. ప్రతి సబ్జెక్ట్కు పర్టిక్యులర్ టైమ్కేటాయించాలి. టఫ్ సబ్జెక్ట్స్ను ఎక్కువసార్లు రివిజన్ చేస్తే సరిపోతుంది. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. సాయంత్రం 7 గంటల్లోపే డిన్నర్ ముగించాలి. వాటర్ఎక్కువగా తాగాలి. ఫోన్,టీవీకి దూరంగాఉండాలి. పేరెంట్స్ కూడా చదువుకునే వాతావరణం కల్పించాలి. సరిగా నిద్రపోయేలా చూడాలి.
.– డాక్టర్ ఎం.ఎ.కరీం, సీనియర్ సైకాలజిస్ట్