మొన్న ఫెయిల్..ఇప్పుడు పాస్ : ‘వెలుగు’ చొరవతో.. జిల్లా టాప్ లో నిలిచిన విద్యార్థిని

మొన్న ఫెయిల్..ఇప్పుడు పాస్ : ‘వెలుగు’ చొరవతో.. జిల్లా టాప్ లో నిలిచిన విద్యార్థిని

మహబూబ్​నగర్​, వెలుగు: ఇప్పటికిప్పుడు పరీక్ష పెట్టినా టాప్ మార్కులు తెచ్చుకుంటానని చాలెంజ్ చేసిన విద్యార్థినిని పాస్​ చేసి ఇంటర్ బోర్డు తప్పు సరిదిద్దుకుంది. 921 మార్కులు వచ్చినా.. ఫిజిక్స్​ పేపర్ 2లో 14 మార్కులేసి ఫెయిల్​ చేసిన అధికారులను మహబూబ్​నగర్ జిల్లా విద్యార్థిని కేఎం గ్రేస్​ సవాల్​ చేసింది. ఆ విషయాన్ని ‘వెలుగు’ వెలుగులోకి తెచ్చింది. సోమవారం ప్రజావాణిలో తన తండ్రితో కలెక్టర్ ను కలిసి వెలుగు పత్రిక కథనాన్ని అందించింది. ఆ ఫిర్యాదుతో ఇంటర్ బోర్డు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. రీవాల్యుయేషన్  లో గ్రేస్​కు 44 మార్కులొచ్చాయి.

951 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచింది. తనకు సాయమందించిన వెలుగుకు గ్రేస్​ కృతజ్ఞతలు తెలిపింది. ఇంటర్ లో ఫెయిల్​ అయ్యాను అనగానే జీవితంలో ఓడిపోయానని బాధపడ్డానంటూ గ్రేస్​ చెప్పుకొచ్చింది. తాను చదువుతున్న వాగ్దేవి కాలేజీ కరస్పాండెంట్ ఓదార్చారని, తనకు జరిగి న అన్యాయాన్ని వెలుగు పేపర్ బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారని చెప్పింది. వెలుగు పేపర్ అందించిన సహకారం వల్లే తాను తిరిగి పాస్​  కాగలిగానని చెప్పింది.

​ఫెయిల్ మెమో, పాస్​ అయినట్టు వచ్చిన సవరణ మెమో