
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న శ్రీ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికిచెందిన రవీందర్ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయ త్నం చేసుకోవడం బాధాకారమన్నారు. ఈ మేరకు బాధితుడు రవీందర్ తో ఎమ్మెల్యే ఫోన్ మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రవీందర్ కు మెరుగైన వైద్యం అందించాలని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను ఆదే శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారు లకే ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు. అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ' ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న పేర్లను డబుల్ టైమ్స్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే నిజమైన అర్హులకు మంజూరు చేస్తం. కావాలనే కొంత మంది ఇందిరమ్మ ఇండ్ల పైన అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లో వారి మాటలను నమ్మొద్దు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. అర్హులైన లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితులో అన్యాయం జరగకుండా. ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. ఆత్మహత్యాయత్నం చేయడం సరికాదు. గందరగోళం సృష్టిస్తా అంటే ఊరుకోం. చట్టపరంగా న్యాయబద్ధంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. ఈ విషయంలో అర్హులు ఆందోళన చెందవద్దు' అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.