ఫోన్ వద్దని మందలించినందుకు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

ఫోన్ వద్దని మందలించినందుకు..  ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

ప్రతి చిన్న విషయానికి పిల్లలు హర్ట్ అవుతున్నారు.  తల్లిదండ్రులు కొద్దిగా మందలిస్తే చాలు  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్ విద్యార్థిని ఫోన్ ఎక్కువుగా వాడుతుందని  ఇన్ స్ట్రాగ్రామ్ లో ఛాటింగ్ చేస్తుందని  తన తల్లి మందలించింది.  దీంతో మనస్థాపం చెందిన ఆ విద్యార్థిని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది,  కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. ఇంటికి రాకపోయేసరికి  విద్యార్థిని తల్లి కళాశాల యాజమాన్యానికి తెలియపరిచింది.  దీంతో కేపిహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు.  ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జిపై ఉన్నట్లు గుర్తించి మాదాపూర్​ పోలీసులకు ..KPHB పోలీసులకు సమాచారం అందించారు.  చెరువులో దూకిన విద్యార్ధిని రెస్క్యూ చేసిన మాదాపూర్​,దుర్గం చెరువు లేక్​ పోలీసులు కాపాడారు.  ప్రస్తుతం  విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.