కొత్తపల్లి, వెలుగు : విజ్ఞానాన్ని ఆస్వాదిస్తేనే విజేతలుగా నిలుస్తారని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరాం అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని సెయింట్జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లయన్స్ క్వెస్ట్ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యరు.
ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్రెడ్డి, శివ ప్రసాద్, ఎం.మహేందర్, ఇ.రమేశ్, వి.జగదీశ్వరాచారి, సురేందర్ పాల్గొన్నారు.
