లోక్​పాల్​కు 33,సీవీసీకి 51 కోట్లు

లోక్​పాల్​కు 33,సీవీసీకి 51 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ అయిన లోక్​పాల్​కు రూ.33.32 కోట్లు బడ్జెట్​లో కేటాయించారు. పోయినేడాది లోక్​పాల్​కు మొదటిసారిగా రూ.92 కోట్లు కేటాయించి, ఆపై 110  కోట్లకు సవరించారు. ఈ సారి మధ్యంతర బడ్జెట్​లో మాత్రం కోత పెట్టారు. ఈ మొత్తాన్ని లోక్​పాల్ ఏర్పాటు, తదితర ఖర్చుల కోసం వినియోగించనున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు మధ్యంతర బడ్జెట్​లో రూ.51.31 కోట్లు కేటాయించారు.