గీతంలో ప్రారంభమైన నేషనల్​కాన్ఫరెన్స్​

గీతంలో ప్రారంభమైన నేషనల్​కాన్ఫరెన్స్​

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు :  పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ స్కూల్​ ఆఫ్ సైన్స్​ ఫిజిక్స్​ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో బుధవారం నేషనల్​ కాన్ఫరెన్స్​ ఘనంగా ప్రారంభమైంది. ‘అడ్వాన్సెస్​ ఇన్​ కండెన్స్​డ్​ మ్యాటర్​ ఫిజిక్స్’​ అనే అశంపై మూడు రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకే చోటకు చేర్చి, వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి గీతం సదస్సు వేదిక కానుందని కాన్ఫరెన్స్​ చైర్​ ప్రొఫెసర్​ అశోక్​ ఛటర్జీ అన్నారు.

అంతర్​ విభాగ స్వభావాన్ని ప్రస్తావించడంతో పాటు యువత దీనిని సద్వినియోగం చేసుకోవడం, భవిష్యత్​ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్కూల్​ ఆఫ్ సైన్స్​ ప్రిన్సిపల్​ ప్రొఫెసర్​ దత్తాత్రి జెయిస్ కె. నగేషా సూచించారు. ముందుగా కాన్ఫరెన్స్​ ప్రొసీడింగ్స్​ని అతిథులంతా కలిసి విడుదల చేశారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల, యూనివర్శిటీల ప్రతినిధులతో పాటు రష్యా, టర్కీ ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.