నిజామాబాద్ రూరల్, వెలుగు : గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మోపాల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ సౌత్ సీఐ సురేశ్కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మోపాల్ మండలం కంజర్ గ్రామ శివారులో కొంతమంది గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్సై సుస్మిత దాడి చేసి అమీర్ఖాన్, షేక్అఫ్రోజ్, శివ లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
నిజామాబాద్ నుంచి నాందేడ్కు వెళ్లి రూ.10వేలకు కిలో గంజాయి చొప్పున తీసుకొచ్చి 5 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి రూ.200 నుంచి 300లకు అమ్ముతున్నారని తెలిపారు. నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 1.2కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
