
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పడు ఈ హీరో మరో కొత్త సినిమాతో బిజీ అయ్యాడు. ఈ చిత్రానికి 'నేను స్టూడెంట్ సర్' అనే టైటిల్ ను ఇప్పటికే మేకర్స్ ఖరారు చేశారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాఖీ ఉప్పలపాటి ఈ చిత్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో అలనాటి అందాల నటి భాగ్యశ్రీ కూతురైన అవంతిక దస్సాని హీరోయిన్గా నటించబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ ప్రాజెక్టులో అవంతిక దస్సాని విద్యార్థినిగా కనిపించనుంది. ఈ మూవీలో శృతి వాసుదేవన్ పాత్రలో అవంతిక నటించనుంది. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాకు కథనందిస్తుండగా..మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, అవంతిక ఇంతకుముందు హిందీ వెబ్ సిరీస్ ‘మిథ్య’తో సిల్వర్ స్క్రీన్పై మెరిసింది.