- కాంగ్రెస్ నుంచి ఆహ్వానం.. పార్టీ మారుతారనే ప్రచారం
- మాజీ మంత్రి జూపల్లికి ఆహ్వానం అందినట్లు ప్రచారం..
- ఇండిపెండెంట్గా పోటీచేస్తారంటున్న అనుచరులు
- అలర్ట్ అయిన టీఆర్ఎస్.. జూపల్లికి మంత్రి పదవి ఆఫర్?
- పీసీసీ చీఫ్తో మంత్రి నిరంజన్రెడ్డి అనుచరుడి భేటీ..
- రంగులు మారుతున్న కొల్లాపూర్ రాజకీయం
నాగర్కర్నూల్, వెలుగు: నిన్నమొన్నటి వరకు కొల్లాపూర్ నియోజకవర్గానికి పెద్దదిక్కు ఎవరూ లేరు. కాంగ్రెస్పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్దన్రెడ్డి కారెక్కగానే ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్లో చేరడంతో మండల స్థాయి లీడర్లూ కనిపించకుండా పోయారు. దీంతో మున్సిపల్, లోకల్బాడీ ఎలక్షన్స్లో కూడా ఖాతా తెరవలేని పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టగానే కొల్లాపూర్ లీడర్లలో కదలిక మొదలైంది. మాజీ మంత్రి జూపల్లిని రేవంత్ కాంగ్రెస్లోకి ఇన్వైట్చేశారనే ప్రచారం మొదలుకాగానే టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి టీఆర్ఎస్లో చేరిన జగదీశ్వర్ రావు ‘పాలమూరు నిరుద్యోగ జంగ్ సైరన్’లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. జూపల్లి ఎపిసోడ్ నడుస్తుండగానే మంత్రి నిరంజన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరున్న రంగినేని అభిలాష్రావు రేవంత్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరికపై ఆయన స్పష్టత ఇవ్వక పోయినా త్వరలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్లో వెలివేత కొనసాగితే జూపల్లి రూట్మారుతుందనే ప్రచారం ఉంది.
రేవంత్ నోట జూపల్లి మాట..
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్, టీఆర్ఎస్హయాంలో మంత్రిగా వెలుగొందిన జూపల్లి రాజకీయ భవిష్యత్పై చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో టికెట్ హామీ .. లేని టీఆర్ఎస్లో కృష్ణారావు కొనసాగుతారా? లేక కాంగ్రెస్లోకి వెళ్తారా? అన్నది చర్చగా మారింది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్టికెట్రాకుంటే ‘సార్ఇండిపెండెంట్గా పోటీలో ఉంటారు.’ అని ఆయన అనుచరులు అంటున్నారు. ఇటీవల కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కొందరు లీడర్లు , కార్యకర్తలు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డిని కలిసిన టైంలో ‘‘సార్ మా కొల్లాపూర్కు సరైన లీడర్ లేడని చెప్పగా రేవంత్ ప్రస్తావించిన పేర్లలో మాజీ మంత్రి జూపల్లి పేరు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది''. దీంతో జూపల్లి కాంగ్రెస్లో చేరుతారా? అన్నదానిపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇండిపెండెంట్గా పోటీ పక్కా..
ఊహాగానాలపై లోకల్ మీడియా జూపల్లి వివరణ కోరగా తనను ఎవరూ సంప్రదించలేదని, టీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పినట్లు సమాచారం. కానీ ఆయన ముఖ్య అనుచరులు ‘సార్పక్కా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చెబుతున్నారు. జూపల్లి కాంగ్రెస్ఎంట్రీ వార్తలతో అలర్ట్అయిన టీఆర్ఎస్హైకమాండ్లోకల్బాడీస్ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిపించుకుని మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ మంత్రి, టీఆర్ఎస్లీడర్లు ఎటువంటి కామెంట్చేయడం లేదు. 3 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన సీఆర్జగదీశ్వర్రావు కాంగ్రెస్ టికెట్ తనకే కన్ఫాం అన్న ధీమాతో కాంగ్రెస్లో చేరారు. వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డికి అతి సన్నిహితుడిగా పేరున్న రంగినేని అభిలాష్రావు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్దన్రెడ్డితో సంబంధం లేకుండా సొంతంగా పార్టీ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మంత్రికి తెలియకుండానే అభిలాష్ తిరుగుతున్నారా? అని టీఆర్ఎస్లో చర్చ సాగుతోంది.
హర్షవర్దన్ రెడ్డి చేరికతో..
కాంగ్రెస్ నుంచి గెలుపొందిన హర్షవర్దన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో జూపల్లితో పాటు ఆయన అనుచరులు డిఫెన్స్లో పడ్డారు. పార్టీని వీడాలన్న అనుచరుల వత్తిడిని తిరస్కరించిన జూపల్లి తన ఓటమికి పార్టీని ఎలా బాధ్యులను చేస్తామన్న రీతిలో వేచిచూసే ధోరణి అవలంభించారు. కొల్లాపూర్లో నిలువున చీలిన టీఆర్ఎస్కు అసలు సిసలు నాయకుడెవరన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామపంచాయితీ ఎన్నికలు, సింగిల్ విండో ఎన్నికల్లో జూపల్లి తన వర్గాన్ని రంగంలోకి దించి రాజకీయాలను రసవత్తరంగా మార్చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గీయులు వేరే పార్టీ నుంచి గెలుపొందారు. జూపల్లి మద్దతు ఇస్తామన్న అవసరం లేదన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ఎక్స్ అఫీషియో ఓట్ల తో బీరం వర్గీయులకు చైర్మన్, వైస్ పదవులు దక్కేలా పావుల కదిపారు. కొల్లాపూర్లో జరిగే అధికారిక ప్రోగ్రామ్స్కు ఆయనను దూరం పెట్టారు. అధికారం చేజారడం, సొంత పార్టీ నేతలే పట్టించుకోకపోవడంతో వెలివేతకు గురవుతున్నామన్న భావనలో ఉన్న జూపల్లి వర్గీయులు పల్లె నుంచి పట్టు పెంచుకోవడానికి పాదయాత్రలు మొదలు పెట్టారు.
జూపల్లి.. నో కామెంట్!
జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపొచ్చిందన్న వార్తల నేపథ్యంలో చేరే విషయంపై బాహాటంగా స్పందించకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని అనుచరులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై కూడా ఆయన ఎటువంటి కామెంట్చేయకపోవడం గమనార్హం.
నియోజకవర్గంలో పట్టున్న నేత..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ నుంచి రెండోసారి ఎన్నికైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన ఆయన ఉద్యమ టైంలో టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధపడి మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012లో తన రాజీనామాతో ఏర్పడిన ఖాళీతో వచ్చిన బై ఎలక్షన్లలో టీఆర్ఎస్అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 లో తిరిగి ఎన్నికైన జూపల్లి కేసీఆర్మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు.2018 ఎన్నికల్లో టీఆర్ఎస్అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. బీరం గెలుపునకు, జూపల్లి ఓటమికి టీఆర్ఎస్జిల్లా పార్టీలో ఒకవర్గం అంతర్గతంగా పనిచేసిందనే పుకార్లు వినిపించాయి.