ఐపీఎల్ 2022 టోర్నీపై BCCI కీలక ప్రకటన

ఐపీఎల్ 2022 టోర్నీపై BCCI కీలక ప్రకటన

ఇండియన్ ప్రీమిర్ లీగ్ (IPL) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది BCCI. IPL  2022 సీజన్ ను మన ఇండియాలోనే నిర్వహిస్తామని BCCI  లేటెస్టుగా ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ సన్మాన కార్యక్రమం లో బీసీసీఐ సెక్రటరీ జైషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ 2022 టోర్నీపై కీలక ప్రకటన చేశారు.

వచ్చే ఏడాది రెండు కొత్త IPL టీం లు వస్తున్నాయని..మెగా వేలం కూడా ఉందని జైషా ప్రకటించారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో వచ్చే ఏడాది టోర్నీని ఇండియాలోనే నిర్వహించాలని తాము నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో నిర్వహిస్తే ఇండియన్స్ క్రికెట్ ను చాలా మిస్ అవుతున్నారని… తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు.

IPL 2021 కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. దుబాయ్ లో నిర్వహించారు.