వెల్లడించిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్–13 షెడ్యూల్ నేడు రిలీజ్ కానుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గురువారం వెల్లడించాడు. ‘షెడ్యూల్ ఇప్పటికే లేట్ అయ్యిందనుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ షేప్కు తీసుకొచ్చాం. శుక్రవారం దుబాయ్లో బ్రిజేశ్ పటేల్ షెడ్యూల్ను రిలీజ్ చేస్తారు’ అని దాదా తెలిపాడు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ జరుగుతుందని రెండు నెలల కిందటే ప్రకటించినా.. ఫైనల్ షెడ్యూల్ను వెల్లడించకపోవడంతో అందరిలో ఆశ్చర్యం నెలకొంది. ట్రావెలింగ్, బయో బబుల్ సెక్యూరిటీ, ఇతరత్రా అంశాలపై తీరిక లేకుండా గడిపిన బీసీసీఐ అధికారులు షెడ్యూల్కు కూడా తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే పూర్తి షెడ్యూల్ను రిలీజ్ చేస్తారా? లేక పార్ట్స్గా వస్తుందా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఇక బ్లాక్బాస్టర్ ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే), ముంబై ఇండియన్స్ మధ్యనే జరిగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్తోనే లీగ్కు ఫుల్ హైప్ తీసుకురావాలని ఐపీఎల్ పాలకులు టార్గెట్గా పెట్టుకున్నారు.
నో సెల్ఫ్ ఐసోలేషన్
క్వారంటైన్ నుంచి అన్ని ఫ్రాంచైజీలకు విముక్తి కల్పించిన బీసీసీఐ.. సెల్ఫ్ ఐసోలేషన్ను కూడా పక్కనబెట్టింది. అంటే దుబాయ్, అబుదాబి, షార్జా మధ్య మ్యాచ్ల కోసం తిరిగే ప్లేయర్లు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐపీఎల్తో అసోసియేట్ అయ్యే ప్రతి ఒక్కరు బయో బబుల్లోనే ఉండటంతో పాటు స్ట్రిక్ట్ ప్రొటోకాల్స్ను పాటిస్తారు. కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా ఐసోలేషన్ అవసరం లేదని నిర్ణయించారు.
సీఎస్కే ప్రాక్టీస్కు రెడీ !
మాండేటరి క్వారంటైన్ పిరియడ్ ముగియడంతో.. శుక్రవారం నుంచి సీఎస్కే ట్రెయినింగ్ మొదలుపెట్టే చాన్స్ ఉంది. 13 మంది పాజిటివ్స్ మినహా మిగతా వారికి చేసిన ఫస్ట్ టెస్ట్లో నెగెటివ్ గా వచ్చింది. ఇక గురువారం నిర్వహించిన రెండో టెస్ట్లోనూ నెగెటివ్ వస్తే ట్రెయినింగ్కు లైన్ క్లియరైనట్టే.
ఎన్సీఏలో ఇద్దరికి కరోనా
బెంగళూరు: కరోనా వైరస్ క్రికెట్ను గట్టిగానే పట్టుకున్నట్లుగా ఉంది. ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీమ్ మెంబర్ వైరస్ బారిన పడగా, తాజాగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఇద్దరికి పాజిటివ్గా తేలింది. ‘బీసీసీఐ మెంబర్స్కు కూడా కరోనా సోకింది. కాకపోతే లక్షణాలు పెద్దగా లేవు. వాళ్లు యూఏఈ వెళ్లే క్రమంలో ఎవరితో కాంటాక్ట్ కాలేదు. ఇక ఎన్సీఏ మెంబర్స్కు కూడా సింప్టమ్స్ లేవు. వీళ్లను ఐసోలేషన్లో ఉంచారు’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.