ముంబై: స్టాక్మార్కెట్లు వచ్చే వారం సందడిగా కనిపించనున్నాయి. మెయిన్బోర్డ్, ఎస్ఎంఈ విభాగాలలో 11 ఐపీఓలు రానున్నాయి. డిసెంబర్ 8 నుంచి 17 మధ్య ఈ ఇష్యూల ద్వారా సుమారు రూ.13,807 కోట్లు సమీకరించనున్నాయి. వీటిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ 12–16 తేదీల్లో ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ.10 వేల కోట్లు సేకరించనుంది. డిసెంబర్ 8న రెండు మెయిన్బోర్డ్ ఆఫరింగ్స్ ప్రారంభమవుతాయి. కరోనా రెమెడీస్ ఫార్మా కంపెనీ రూ.655 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ను రూ.1,008–1,062 ధర వద్ద అందిస్తోంది. దేశీయంగా బలమైన అమ్మకాలు, వృద్ధి, లాభదాయకత దీనికి ఉన్నాయి.
అదే రోజున ఫర్నిచర్ హోమ్ సొల్యూషన్స్ బ్రాండ్ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ రూ.1,289 కోట్ల ఐపీఓను రూ.185–195 ధర వద్ద మొదలుపెడుతుంది. డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రొడాక్స్ సొల్యూషన్స్ కూడా రూ.27.6 కోట్ల చిన్న ఐపీఓను డిసెంబర్ 8న ప్రారంభిస్తుంది. డిసెంబర్ 10న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్, పార్క్ మెడి వరల్డ్, యూనిసెమ్ అగ్రిటెక్ తమ ఇష్యూలను ప్రారంభిస్తాయి.
డయాలసిస్ సేవలు అందించే హైదరాబాద్కంపెనీ నెఫ్రోకేర్ రూ.871 కోట్లు (ప్రైస్బ్యాండ్ రూ.438–460) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటల్చైన్ పార్క్ మెడి వరల్డ్ రూ.920 కోట్లు సమీకరించనుంది. వ్యవసాయ పరిష్కారాల సంస్థ యూనిసెమ్ అగ్రిటెక్ రూ.21.45 కోట్లను సేకరించనుంది. ఎస్ఎంఈ ఐపీఓలు ఈ వారంలో రూ.208 కోట్లు రాబట్టనున్నాయి.
