నిజాంపేట్ కార్పొరేషన్లో అక్రమాలు: కలెక్టర్కు బీజేపీ ఫిర్యాదు

నిజాంపేట్ కార్పొరేషన్లో అక్రమాలు: కలెక్టర్కు బీజేపీ  ఫిర్యాదు

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట్​ కార్పొరేషన్​ లోని ఇంజినీరింగ్​, టౌన్​ప్లానింగ్​, రెవెన్యూ శాఖలలో పాటు కమిషనర్​ అక్రమాలపై విచారణ జరపాలని నిజాంపేట్​ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీశ్​ జిల్లా కలెక్టర్​కు బుధవారం ఫిర్యాదు చేశాడు. 

జీహెచ్​ఎంసీ లో విలీనం తరువాత నిజాంపేట్​ కార్పొరేషన్​లో అవినీతి కార్యక్రమాలు ఎక్కవగా జరుగుతున్నాయని ఆరోపించారు. పలు శాఖల అధికారులు అర్ధరాత్రి వరకూ కార్యాలయంలో ఉండి రూల్స్​కు విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పారు. విలీనం తరువాత జరిగిన లావాదేవీలను తనిఖీ చేయాలని డిమాండ్​ చేశారు.