పెళ్లి అయిపోయిందా? పూలదండలతో జయం రవి, కెనీషా ఫోటోలు వైరల్.. క్లారిటీ ఇదే!

పెళ్లి అయిపోయిందా? పూలదండలతో జయం రవి, కెనీషా ఫోటోలు వైరల్.. క్లారిటీ ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తి (Arthi) నుండి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాల వివాహం తర్వాత తన భార్యతో విడిపోతున్నట్లు జయం రవి తెలుపడంతో.. సడెన్గా సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వార్తల్లో నిలిచింది.

రవి తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం సింగర్తో తాను రిలేషన్‌లో ఉండటమే అని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య పలు ఈవెంట్లకు కలిసే వెళ్తున్నారు. ఈ క్రమంలో మరో ట్విస్ట్ మొదలైంది. 

లేటెస్ట్గా జయం రవి, కేనీషా పెళ్లి చేసుకున్నట్లు పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరీ ఇరువురి మెడలో పూల దండలు, పూజారులు ఆశీర్వాదం తీసుకుంటున్న ఓ ఫోటో బయటకి వచ్చింది. దాంతో  వీరి పెళ్లి అయిపోయిందా? రవి భార్య ఆర్తి అనుమానమే నిజమైందా? అని కామెంట్స్ పెడుతున్నారు.

అయితే, ఈ ఫొటోస్ వెనుక అసలు విషయమేంటంటే.. వీరికి పెళ్లి జరగలేదని సమాచారం. తన నిర్మాణ సంస్థ ‘రవి మోహన్‌ స్టూడియోస్‌’ లోగోను జయం రవి గురువారం (జూన్ 5న) సోషల్‌ మీడియా వేదికగా లాంచ్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ కు ముందు రవి, కెనీషా కలిసి తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కుండ్రతుర్‌ మురుగన్‌ దేవాలయాన్ని సందర్శించారు. దర్శనం అనంతరం.. అర్చకులతో కలిసి  ఫొటోలు దిగారు. ఇపుడే ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో పెళ్లి జరిగిందనే టాక్ వైరల్ అవుతుంది. 

ఇటీవలే చెన్నైలో జరిగిన నిర్మాత ఇషారి గణేష్ కుమార్తె వివాహానికి నటుడు రవి, అతని రూమర్ గర్ల్ ఫ్రెండ్, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ అటెండ్ అయ్యారు. ఈ జంట ఒకేరకమైన దుస్తులలో వచ్చి ఫంక్షన్ మొత్తం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఒకే ఫంక్షన్ లో ఒకటిగా రావడం, చేతులు పట్టుకుని నడవడం వంటి ఫోటోలు, వీడియోలు ఇపుడు కూడా  వైరల్ అవుతున్నాయి. 

ఇకపోతే, జయం రవి, ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తితో 2009 నుండి వివాహం చేసుకున్నారు. రవి మోహ‌న్-ఆర్తిలా విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరుగనుంది.