కొనసాగించుడేంది: హై కోర్టు
హైదరాబాద్, వెలుగు: ‘‘రౌడీ షీట్ తెరవడానికి ఒక పద్ధతి పాడు లేదా..? పోలీసులు ఇష్టానుసారంగా రౌడీ షీట్లు తెరుస్తున్నారు. దీనికో విధానమంటూ ఏమీ లేనట్లుంది. ఒక కేసు నమోదైతే చాలు రౌడీ షీట్ తెరుస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. పిటిషనర్ నిర్దోషి అని 2010లో తేలితే ఇంకా రౌడీ షీట్ కొనసాగింపు జీవించే హక్కుల ఉల్లంఘనే అవుతుంది’’అని పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై రౌడీ షీట్ తెరిచేటప్పుడు పోలీసులు అమలు చేస్తున్న విధానాలు, అనుసరిస్తున్న పద్ధతులను వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.