
ఆగస్టు 15న అద్భుతానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్మాల్ శాటిలైట్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వి)ని ఉపయోగించి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్)ను ప్రయోగించనుంది ఇస్రో. ఎస్ఎస్ఎల్వి థర్డ్ అండ్ ఫైనల్ డెవలప్మెంట్ ఫ్లైట్ ఆగస్టు 15వ తేదీ ఉదయం 9:17 గంటలకు శ్రీహరికోట నుండి బయలుదేరుతుందని ఇస్రో ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వి D3/EOS-08గా నామకరణం చేసిన ఈ మిషన్ లో సుమారుగా 175.5 కిలోల బరువున్న మైక్రో-శాటిలైట్ EOS-08ని మోసుకెళ్లనుందని సమాచారం.
EOS-08 మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలలో... మైక్రో-శాటిలైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మైక్రో-శాటిలైట్ బస్కు అనుగుణమైన పేలోడ్ ఇన్స్ట్రుమెంట్స్ ని క్రియేట్ చేయటం, ఫ్యూచర్ ఆపరేషనల్ శాటిలైట్స్ కి అవసరమైన కొత్త టెక్నికాలిటీస్ ని చేర్చడం వంటివి ఉన్నాయి. ఈ మిషన్ SSLV డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తుందని తెలిపింది ఇస్రో.